చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-05-30T12:12:11+05:30 IST

జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లిలోని బిస్కెట్‌ ఫ్యాక్టరీ దగ్గర బైక్‎ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు: జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లిలోని బిస్కెట్‌ ఫ్యాక్టరీ దగ్గర బైక్‎ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి సహా తల్లిదండ్రులు మృతి చెందారు. కర్నాటక నుంచి కుర్గేపల్లెకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతుల వివరాలను తెలిపారు. మృతులు మదనపల్లెకు చెందిన నరేష్ (32), ఉమాదేవి (27), చిన్నారి నిషిత (2)గా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-05-30T12:12:11+05:30 IST