ఎస్వీ ప్రసాద్కు మెరుగైన వైద్యం అందించండి: చంద్రబాబు
ABN , First Publish Date - 2021-05-31T03:09:02+05:30 IST
కోవిడ్ బారిన పడి యశోదాలో చికిత్స పొందుతున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్వీ ప్రసాద్ కుటుంబీకులను
![ఎస్వీ ప్రసాద్కు మెరుగైన వైద్యం అందించండి: చంద్రబాబు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921053003280172/05302021213852n24.jpg)
అమరావతి : కోవిడ్ బారిన పడి యశోదాలో చికిత్స పొందుతున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్వీ ప్రసాద్ కుటుంబీకులను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించారు. ఎస్వీ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు ఎస్వీ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ ఎంవీ రావును చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్వీ ప్రసాద్కు మెరుగైన వైద్యం అందిచాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మనో నిబ్బరంతో యస్వీ ప్రసాద్ కోవిడ్ను జయించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.