విభజన హామీల విషయంలో.. మొదటి దోషి కేంద్రం అయితే, రెండో దోషి రాష్ట్రం: చలసాని

ABN , First Publish Date - 2021-10-23T18:03:18+05:30 IST

రాష్ట్రంలో పరిస్థితి చూస్తే బాధగా ఉందని ఆంధ్రా మేథావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడిని ఖండిస్తున్నామన్నారు. ఇంకా చలసాని మాట్లాడుతూ..

విభజన హామీల విషయంలో.. మొదటి దోషి కేంద్రం అయితే, రెండో దోషి రాష్ట్రం: చలసాని

విశాఖపట్నం : రాష్ట్రంలో పరిస్థితి చూస్తే బాధగా ఉందని ఆంధ్రా మేథావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడిని ఖండిస్తున్నామన్నారు. ఇంకా చలసాని మాట్లాడుతూ.. ‘‘వైసీపీ, టీడీపీకి చెందిన వారుకొందరు.. మాపై బూతులతో  ట్రోల్ చేస్తున్నారు. మేము ఏ పాపం చేశాం? చంద్రబాబు, జగన్‌ని నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ ఏమీ అనలేదు. విధానపరంగా మాత్రమే విమర్శించాను. స్టీల్ ప్లాంట్‌తో సహా అన్ని విషయాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగేతే అధికార పక్షం ఎందుకు మాట్లాడం లేదు? విభజన హామీలు అమలు కాకపోవడానికి.. మొదటి దోషి కేంద్రం అయితే, రెండో దోషి రాష్ట్రం. కేంద్రంపై ఎందుకు పోరాటం చేయడం లేదు? మీకు ఖలేజా ఉంటే పోరాడండి. మేమూ వస్తాం. నా కుటుంబంలో విషాదం జరిగింది. అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నాము. రాష్ట్ర ఎంపీలు ఏమి చేస్తున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయని వారు ద్రోహులుగా మిగిలిపోతారు. చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ ఒక స్టేజ్ మీదకు వస్తే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది’’ అన్నారు.

Updated Date - 2021-10-23T18:03:18+05:30 IST