బెయిల్ రద్దు కేసులో.. కౌంటర్ దాఖలుకు జగన్కు గడువు
ABN , First Publish Date - 2021-05-08T09:12:50+05:30 IST
అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి బెయిల్ను రద్దు చేయాలనే వ్యాజ్యంలో కౌం టర్ దాఖలుకు మరింత సమయమివ్వాలని ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు.

సీబీఐ కోర్టు విచారణ 17కి వాయిదా
హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి బెయిల్ను రద్దు చేయాలనే వ్యాజ్యంలో కౌం టర్ దాఖలుకు మరింత సమయమివ్వాలని ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు. న్యాయస్థానం అందుకు అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేయడం, దానిని విచారణకు స్వీకరించిన కోర్టు.. జగన్, సీబీఐలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యం శుక్రవారం న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్రావు ఎదుట మరోసారి విచారణకు వచ్చింది. కోర్టు నోటీసులు అందాయని, కౌంటర్ దాఖలుకు సమయం కావాలని జగన్ తరఫు న్యాయవాది.జి.అశోక్రెడ్డి కోరడంతో అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.