దినేశ్ దాస్ కంపెనీపై సీబీఐ కేసు
ABN , First Publish Date - 2021-09-02T09:34:22+05:30 IST
ఒడిశాలోని రూర్కెల స్టీల్ ప్లాంట్ సీనియర్ అధికారి చరణ్ బెహ్రాతోపాటు, ఆంధ్రప్రదేశ్లోని గొట్టివలసలో ఉన్న దినేశ్ దాస్ అండ్
![దినేశ్ దాస్ కంపెనీపై సీబీఐ కేసు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
న్యూఢిల్లీ, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఒడిశాలోని రూర్కెల స్టీల్ ప్లాంట్ సీనియర్ అధికారి చరణ్ బెహ్రాతోపాటు, ఆంధ్రప్రదేశ్లోని గొట్టివలసలో ఉన్న దినేశ్ దాస్ అండ్ సన్స్ మైన్స్, స్టీల్స్ కంపెనీ డైరెక్టర్లు దినేశ్ చంద్రదాస్, తారక్నాథ్ దాస్, తన్మయ్నాథ్ దాస్పై సీబీఐ కేసు నమోదు చేసింది. చరణ్ బెహ్రాతో కుమ్మక్కయ్యి ఏప్రిల్ 2015 నుంచి ఏప్రిల్ 2018 వరకు రూర్కెల స్టీల్ ప్లాంట్ను దినేశ్ దాస్ కంపెనీ రూ.99,47,121 కోట్ల మేర మోసం చేసిందని సీబీఐ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ముడి సరుకు సరఫరాకు సంబంధించిన బిల్లులను ఫోర్జరీ చేశారని, దాంతో రూర్కెల స్టీల్ ప్లాంట్కు నష్టం జరిగిందని సీబీఐ వెల్లడించింది.