టీడీపీ మహిళా నేతలపై కేసు
ABN , First Publish Date - 2021-11-24T20:30:54+05:30 IST
ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో టీడీపీ మహిళా నేతలపై కేసు చేశారు. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
అనంతపురం: ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో టీడీపీ మహిళా నేతలపై కేసు చేశారు. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. టీడీపీ మహిళా నాయకురాలు వాల్మీకి ప్రియాంక సహా పలువురు మహిళా నేతలను పోలీసులు విచారిస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా వెనుకాడేదిలేదని టీడీపీ నేత ప్రియాంక స్పష్టం చేశారు. టీడీపీ నేతలపై కేసు నమోదు చేయడాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేసులను వెంటనే ఎత్తివేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.