తెలంగాణకు సాగిలపడ్డారా?
ABN , First Publish Date - 2021-03-01T09:40:31+05:30 IST
తెలంగాణకు సాగిలపడ్డారా?
అలాగే, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఢిల్లీలో బాదుషాలకు భయపడి, పోలవరం అంచనా విలువను తగ్గించే ప్రయత్నం చేయడం సరికాదని బుచ్చయ్య చౌదరి మరో ట్వీట్లో ఆక్షేపించారు. ‘తెలంగాణ కు సాగిల పడ్డారా? ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తే, అనుకున్న లక్ష్యం నెరవేరదు. పోలవరం ఎత్తు 45.72 మీటర్లతోనే పూర్తి లాభం వస్తుంది. 41.15 మీటర్ల ఎత్తు వల్ల రాయలసీమలో దుర్భిక్షం పోదు. ఉత్తరాంధ్రకు నీటి ధార అందదు. నిధుల లేమి వంకతో డ్యాం ఎత్తు తగ్గించాలనుకోవడం అవివేకం’ అని పేర్కొన్నారు.