కాంట్రాక్టు వైద్య సిబ్బందిని క్రమబద్ధీకరించండి: బొప్పరాజు
ABN , First Publish Date - 2021-05-06T08:56:53+05:30 IST
రాష్ట్రంలోని కాంట్రాక్టు పారా మెడికల్ సిబ్బంది కష్టాన్ని గుర్తించి తక్షణమే వారందరినీ క్రమబద్ధీకరించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు
అమరావతి/విజయవాడ, మే 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కాంట్రాక్టు పారా మెడికల్ సిబ్బంది కష్టాన్ని గుర్తించి తక్షణమే వారందరినీ క్రమబద్ధీకరించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు చనిపోతే జీవో 25 ప్రకారం రూ.2 లక్షల పరిహారం ఇవ్వాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు 40 మంది చనిపోయినా ఒక్క రూపాయి కూడా వారి కుటుంబాలకు చెల్లించకపోవడం బాధాకరమన్నారు.