బొబ్బిలిలో టీడీపీ జోరు
ABN , First Publish Date - 2021-03-14T17:24:58+05:30 IST
బొబ్బిలి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ జోరు కొనసాగుతోంది.
![బొబ్బిలిలో టీడీపీ జోరు](https://media.andhrajyothy.com/appimg/galleries/2021031411530877/03142021115443n97.jpg)
విజయనగరం జిల్లా: బొబ్బిలి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ జోరు కొనసాగుతోంది. 8 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా.. 7 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ నేత, మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు బొబ్బిలి మున్సిపాటికిటీ సంబంధించి బాధ్యత తీసుకున్నారు. బొబ్బిలిలో ఎలాగైనా టీడీపీని ఓడించాలని మంత్రి బొత్స, మరో 8 మంది శాసనసభ్యులు బొబ్బిలో మకాం వేశారు. ఈ దశలో అన్నీ, అంతా తానై అన్నట్టు సుజయకృష్ణ రంగారావు సోదరుడు చక్రం తిప్పి.. సైకిల్ పరుగుపెట్టించారు. మున్సిపల్ స్థానాన్ని టీడీపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బొబ్బిలిలో టీడీపీ జెండా ఎగురవేసే సంకేతాలు కనిపిస్తున్నాయి.