బొబ్బిలిలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-08-25T21:53:19+05:30 IST
విద్యార్థుల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా కరోనా బారినపడుతున్నారు.

బొబ్బిలి: విద్యార్థుల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా కరోనా బారినపడుతున్నారు. బొబ్బిలిలో కరోనా కలకలం రేగింది. జయప్రకాష్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 10 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు రిపోర్టలు వచ్చింది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాద్యాయులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 12కు చేరింది. పీవీఆర్ బాలికల హైస్కూల్లో ఇద్దరు పదవ తరగతి విద్యార్థులు, ఓ ఎనిమిదవ తరగతి విద్యార్థినికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఒంగోలు డీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడితో సహా నలుగురు ఉపాధ్యాయులు, ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. పాఠశాలల్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అక్టోబర్లో కోవిడ్ థర్డ్ వేవ్పై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో పాఠశాలల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.