ఏపీలో కొందరు నేతలు త్వరలో జైలుకు పోతారు: ప్రకాశ్ జవదేకర్

ABN , First Publish Date - 2021-12-28T23:25:39+05:30 IST

ఏపీలో బెయిల్‌ మీద ఉన్న కొందరు నేతలు త్వరలో జైలుకు పోతారని బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు నిర్వహించిన...

ఏపీలో కొందరు నేతలు త్వరలో జైలుకు పోతారు: ప్రకాశ్ జవదేకర్

విజయవాడ: ఏపీలో బెయిల్‌ మీద ఉన్న కొందరు నేతలు త్వరలో జైలుకు పోతారని బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభలో ఆయన మాట్లాడుతూ పుష్ప సినిమాలో మాదిరిగా ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతోందన్నారు. విచారణకు ఏర్పాటు చేసిన సిట్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిందని ప్రకాష్‌ జవదేకర్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రకాశ్ జవదేకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని విస్తృతంగా చర్చ జరుగుతోంది. 



Updated Date - 2021-12-28T23:25:39+05:30 IST