వైఎస్‌ఆర్ ఆత్మ ఘోషిస్తుంది: రమేష్‌నాయుడు

ABN , First Publish Date - 2021-07-09T00:27:24+05:30 IST

వైఎస్‌ఆర్‌ను బండ బూతులు తిట్టినా, సీమకు నీటి వాటా పంచాయతీ పెట్టినా జగన్ నుంచి నోటి

వైఎస్‌ఆర్ ఆత్మ ఘోషిస్తుంది: రమేష్‌నాయుడు

అమరావతి: వైఎస్‌ఆర్‌ను బండ బూతులు తిట్టినా, సీమకు నీటి వాటా పంచాయతీ పెట్టినా జగన్ నుంచి నోటి మాట రాకపోవడం బాధాకరమని బీజేపీ నాయకుడు రమేష్‌నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ కారణంగా వైఎస్‌ఆర్ ఆత్మ ఘోషిస్తుందని  రమేష్‌నాయుడు మండిపడ్డారు. జగన్ ఆస్తులను కాపాడుకోవడానికి, షర్మిల రాజకీయ జీవితం కోసం రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర సమస్యలు, రాయలసీమ సమస్యలపై బీజేపీ పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ పనిచేయాలని రమేష్‌నాయుడు  హితవు పలికారు. 

Updated Date - 2021-07-09T00:27:24+05:30 IST