చంద్రబాబు అలా చెప్పడం విడ్డూరంగా ఉంది: బాలినేని
ABN , First Publish Date - 2021-04-12T22:04:55+05:30 IST
విపక్షాలపై మంత్రి బాలినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... తెలుగుదేశాన్ని..
ప్రకాశం: విపక్షాలపై మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలుగుదేశాన్ని గెలిపిస్తే టీటీడీని అభివృద్ధి చేస్తామని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తిరుపతి ప్రచారంపై విపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారానికి జగన్ వస్తున్నారంటే భయపడి వస్తున్నారన్నారు.. ప్రచారం రద్దు చేసుకోవడంతో ఓటమి భయంతో రావడం లేదంటున్నారని చెప్పారు. జగన్ పాలన చూసి తిరుపతి ప్రజలు వైసీపీకి ఓటేస్తారని మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు.