ఏపీ భవన్లో బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి

ABN , First Publish Date - 2021-04-06T09:04:03+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ భవన్లో బడుగు వర్గాల అభ్యున్నతికోసం విశేషంగా కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ 113వ జయంతి వేడుకలు ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అభయ్‌త్రిపాఠి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా

ఏపీ భవన్లో బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ భవన్లో బడుగు వర్గాల అభ్యున్నతికోసం విశేషంగా కృషి చేసిన భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ 113వ జయంతి వేడుకలు ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అభయ్‌త్రిపాఠి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి ఏపీ భవన్‌  రెసిడెంట్‌ కమిషనర్‌ భావ్నా సక్సేనా పూలమాలలు వేసి,  జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-06T09:04:03+05:30 IST