కుప్పంలో 14వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకటేష్పై దాడి
ABN , First Publish Date - 2021-11-05T19:30:38+05:30 IST
కుప్పం మునిసిపల్ 14వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకటేష్పై దాడి జరిగింది. నామినేషన్ వేయడానికి వచ్చిన వెంకటేష్పై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి.

చిత్తూరు : కుప్పం మునిసిపల్ 14వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకటేష్పై దాడి జరిగింది. నామినేషన్ వేయడానికి వచ్చిన వెంకటేష్పై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. టీడీపీ శ్రేణులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. బాధితుడు వెంకటేష్ని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి పరామర్శించారు. ఈ ఘటనను మాజీ మంత్రి అమర్నాథరెడ్డి తీవ్రంగా ఖండించారు.