బేషరతుగా క్షమాపణలు చెప్పండి
ABN , First Publish Date - 2021-05-09T08:50:58+05:30 IST
తిరుమల అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం అంటూ ప్రకటించడాన్ని ఆక్షేపిస్తూ కర్ణాటకలోని శ్రీహనుమద్ జన్మభూ మి తీర్థక్షేత్ర ట్రస్ట్ చేసిన వ్యాఖ్యలపై టీటీడీ స్పందించింది
శ్రీహనుమద్ జన్మభూమి ట్రస్ట్కు టీటీడీ లేఖ
తిరుమల, మే 8(ఆంధ్రజ్యోతి): తిరుమల అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం అంటూ ప్రకటించడాన్ని ఆక్షేపిస్తూ కర్ణాటకలోని శ్రీహనుమద్ జన్మభూ మి తీర్థక్షేత్ర ట్రస్ట్ చేసిన వ్యాఖ్యలపై టీటీడీ స్పందించింది. తమ నివేదికను సమగ్రంగా చదివి, ఆకళింపు చేసుకోవాలని సూచించింది. ఈ దైవకార్యాన్ని దూషించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈమేరకు ట్రస్ట్కు లేఖ పంపింది. ‘ఆంజనేయస్వామి జన్మస్థలాన్ని కనుగొనాలనే సంకల్పంతో పండితులతో పరిషత్తును స్థాపించాం. వారు నివేదికను సమర్పించారు. మా నివేదికను మీ కు పంపుతున్నాం. దాన్ని సమగ్రంగా చదివి, మావి అసత్య ఆధారాలని ఈ నెల 20లోపు నివేదిక పంపం డి. కొవిడ్ తీవ్రత తగ్గా క, చర్చలకు ఆహ్వానిస్తాం. మేము చేసిన ఈ దైవకార్యాన్ని ఇలాంటి సముచితం కాని, ఆదరణీ యం కాని భాషలో దూషించినందుకు బేషరతుగా క్షమాపణలు రాతపూర్వకంగా తెలియజేయాలి’ అంటూ ట్రస్టు వ్యవస్థాపక ధర్మకర్త గోవిందానంద సరస్వతికి టీటీడీ వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి పేరుతో పంపిన లేఖలో పేర్కొన్నారు.