మహిళలపై విమర్శలు హేయం: సత్యకుమార్
ABN , First Publish Date - 2021-11-21T08:05:45+05:30 IST
మహిళలపై విమర్శలు హేయం: సత్యకుమార్

అమరావతి, న్యూఢిల్లీ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రాజకీయాల కోసం మహిళలను కించపరచడం, వ్యక్తిగత విమర్శలు చేయడం హేయమైన చర్య అని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్య కుమార్ అన్నారు. ఆయన శనివారం ట్విటర్లో స్పందించారు. మహిళల్ని గౌరవించడం మన సంప్రదాయమని గుర్తు చేసిన బీజేపీ నేత వైసీపీ దిగజారుడు వ్యాఖ్యలు మానుకోవాలన్నారు.