21 కిలోలు.. 2.60 లక్షలు
ABN , First Publish Date - 2021-10-31T08:45:10+05:30 IST
21 కిలోలు.. 2.60 లక్షలు
![21 కిలోలు.. 2.60 లక్షలు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921103103135659/10312021031500n27.jpg)
ఈ చేప ఖరీదు అక్షరాల 2.60 లక్షలు. తూర్పుగోదావరిజిల్లా సఖినేటిపల్లి మండలం సంతరేవు సాగర సంగమం వద్ద వశిష్ట నదిలో మత్స్యకారుల వలకు 21 కిలోల మగ కచిడీ చేప చిక్కింది. ఈ చేపను స్థానిక ఫిషింగ్ హార్బర్లో వేలం వేయగా రూ.2.60 లక్షలకు అమ్ముడు పోయింది. అరుదుగా దొరికే ఈ కచిడీ చేపలను కలకత్తాకు ఎగుమతి చేస్తారని కొనుగోలుదారులు తెలిపారు. - అంతర్వేది