దేవదాయశాఖ కమిషనరేట్లో గోపూజ
ABN , First Publish Date - 2021-10-29T09:26:20+05:30 IST
దేవదాయశాఖ కమిషనరేట్లో గోపూజ
అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): విజయవాడలోని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో కమిషనర్ హరిజవహర్లాల్ ఆదేశాల మేరకు గురువారం గోపూజ నిర్వహించారు. ద్వారకా తిరుమల నుంచి తీసుకొచ్చిన కపిలగోవు, దూడలతో పూజా కార్యక్రమాలు జరిపారు. కార్యక్రమంలో కమిషనరేట్లోని ఉద్యోగులందరూ పాల్గొన్నారు.