గోవుకు జాతీయ హోదాకు డిమాండ్
ABN , First Publish Date - 2021-10-25T09:15:29+05:30 IST
గోవుకు జాతీయ హోదాకు డిమాండ్

గో మహా సమ్మేళనం సన్నాహక సభలో శివకుమార్
ఖైరతాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): గోవుకు జాతీయ హోదా ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో తిరుపతిలో ఈ నెల 31న జరగనున్న గో మహా సమ్మేళనంలో పలు రాష్ర్టాలకు చెందిన స్వామీజీలు, మఠాధిపతులు పాల్గొంటున్నట్లు యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కె.శివకుమార్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్ జలవిహార్లో గో మహా సమ్మేళనం సన్నాహక సభ జరిగింది. ఇందులో నగరం నుంచి వెళ్లే గో ప్రేమికుల వివరాలను సేకరించడంతో పాటు వారికి కార్యక్రమ వివరాలపై అవగాహన కల్పించారు.