డ్రగ్స్ కేసులో రాష్ట్రం పరువు పోయింది: లంకా దినకర్
ABN , First Publish Date - 2021-10-14T09:20:20+05:30 IST
డ్రగ్స్ కేసులో రాష్ట్రం పరువు పోయింది: లంకా దినకర్
![డ్రగ్స్ కేసులో రాష్ట్రం పరువు పోయింది: లంకా దినకర్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ‘‘మాదక ద్రవ్యాల కేసులో రాష్ట్రానికి పరువు నష్టం జరిగింది. అది మరింత దిగజారే ప్రమాదం ఉం ది. అడ్రస్ అంటే అడ్డా కాదా? అడ్రస్ లేనోడిని సమాజం ఏమంటుంది? ఒక అడ్ర్సతో బుకింగ్ జరిగిందంటే అది ఆరిజన్ ఆఫ్ క్రైమ్ కాదా?’’ అని బీజేపీ నేత లంకా దినకర్ బుధవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ఇంత పెద్ద కేసును వ్యక్తులకు ఆపాదించి రాజకీయ లబ్ధి పొందేందుకు, ప్రభావం తగ్గించేందుకు రాష్ట్రంలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రయత్నం చేస్తున్నాయని దినకర్ ఆరోపించారు.