చిరుద్యోగులు చితికి పోతున్నారు: శైలజానాథ్
ABN , First Publish Date - 2021-10-28T23:36:48+05:30 IST
పన్నులను వరుసగా పెంచడంతో చిరుద్యోగులు ఆర్థికంగా చితికి పోతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు

అమరావతి: పన్నులను వరుసగా పెంచడంతో చిరుద్యోగులు ఆర్థికంగా చితికి పోతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో పెట్రో ధరలను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులతో పేదలపై భారం పెరుగుతోందన్నారు. అధికారంలోకి రాకముందు చమురు ధరలు తగ్గిస్తామన్న జగన్ అధికారంలోకి రాగానే విచ్చలవిడిగా భారం వేస్తున్నారని శైలజానాథ్ ఆరోపించారు.