మోదీ పాలనలో మహిళల కంట కన్నీరు: ఏపీసీసీ
ABN , First Publish Date - 2021-02-27T09:47:29+05:30 IST
ప్రధాని మోదీ పాలన మహిళ ల కంట కన్నీరుకు కారణమవుతోందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ న ర్రెడ్డి తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ పాలన మహిళ ల కంట కన్నీరుకు కారణమవుతోందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ న ర్రెడ్డి తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడు తూ గ్యాస్ ధరల పెంపు మహిళను ఆర్థికంగా కుంగదీయడమేనని, గత ఏడాది డిసెంబరు రెండో తేదీన రూ.50 పెంచిన ప్రభుత్వం.. ఈ రెండు నెలల్లో ఒక్కో సిలిండరుపై రూ.200 ఆర్థిక భారాన్ని మోపిందని తెలిపారు.
టీఎన్యూఎ్స నూతన కమిటీ నియామకం
టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తెలుగునాడు ఉపాధ్యా య సంఘం రాష్ట్ర కమిటీని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రకటించారు. టీఎన్యూఎ్స గౌరవాధ్యక్షుడిగా రెడ్డి రమే్ష(చిత్తూరు), అధ్యక్షుడిగా మూకల అప్పారావు(విజయవాడ), ప్రధాన కార్యదర్శిగా ఎన్. వెంకట్రావు(ప్రకాశం), కోశాధికారిగా షేక్ అబ్దుల్ఖాదర్(విశాఖపట్నం)లను నియమించారు.
జగనే మాయ: బుచ్చయ్య
ఏపీలో సొంతింటి నిర్మాణం కలగా మారిందని టీడీపీ ఎమ్మెల్యే గోరం ట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. ‘ఇసుక రేటు ఆకాశాన్నంటింది. బుక్ చేస్తే ఎప్పుడు వస్తుందో తెలీదు.. పెరిగిన ఇటుక రేట్లు, సిమెంట్ రేటు, రోజు వారీ కూలీల, ఇంధన రేట్లు, ఆస్తి పన్నులు, కరెంట్ బిల్లులు.. ఇవన్నీ కాకుండా వైసీపీ జే ట్యాక్స్ చూస్తుంటే, జనానికి షుగర్, బీపీ వచ్చేలా ఉంది. అందుకే ఏపీలో ఇల్లు కట్టే వారంతా ‘జగమే మాయ’ కాదు.. ‘జగనే మాయ’ అంటున్నారని శుక్రవారం ట్వీట్ చేశారు.