మరో వివాదంలో యాంకర్ ప్రదీప్..
ABN , First Publish Date - 2021-06-21T14:22:52+05:30 IST
యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యలపై ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ రాజధాని విశాఖ అంటూ ఓ టీవీ షోలో యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యలు చేశాడు.
విజయవాడ: యాంకర్ ప్రదీప్కు వివాదాలేమీ కొత్త కాదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటాడు. తాజాగా కూడా ప్రదీప్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తాాజాగా ఓ షోలో ప్రదీప్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ రాజధాని విశాఖ అంటూ ఓ టీవీ షోలో ఆయన వ్యాఖ్యలు చేశాడు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని ఏపీ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ప్రదీప్ క్షమాపణ చెప్పకుంటే హైదరాబాద్లో యాంకర్ ప్రదీప్ ఇంటిని ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్ ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. రైతులు, ప్రజల మనోభావాలు కించపర్చేలా వ్యవహరిస్తే బుద్ధి చెబుతామని కొలికలపూడి శ్రీనివాసరావు హెచ్చరించారు.