‘కోట్ల రూపాయల మేర ఆర్ధిక హామీలు పెండింగ్‌లో ఉన్నాయి’

ABN , First Publish Date - 2021-10-22T00:52:44+05:30 IST

ఆర్ధికేతర అంశాలపైనే ప్రభుత్వం వివిధ శాఖల కార్యదర్శులతో చర్చించటం సరికాదని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

‘కోట్ల రూపాయల మేర ఆర్ధిక హామీలు పెండింగ్‌లో ఉన్నాయి’

అమరావతి: ఆర్ధికేతర అంశాలపైనే ప్రభుత్వం వివిధ శాఖల కార్యదర్శులతో చర్చించటం సరికాదని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా ఆర్ధిక అంశాలపైనే చర్చించాలని ప్రకటించాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ నెల 27 తేదీన జరిగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌కు ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి హాజరు కావాలన్నారు. కోట్ల రూపాయల మేర ఆర్ధిక హామీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటన్నిటినీ పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. 11 పీఆర్సీ నివేదికను సమావేశానికంటే ముందుగానే ఉద్యోగ సంఘాలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెలాఖరు నాటికల్లా 11 పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎస్ కు విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చామన్నారు. 

Updated Date - 2021-10-22T00:52:44+05:30 IST