హైకోర్టు తీర్పుతోనైనా ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగేనా?

ABN , First Publish Date - 2021-01-22T00:59:28+05:30 IST

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలపై..

హైకోర్టు తీర్పుతోనైనా ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగేనా?

హైదరాబాద్/అమరావతి: స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును కొట్టివేయడం జరిగింది. ఎస్‌ఈసీ దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని.. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని హైకోర్టు సూచించింది. 


అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు రేపో, మాపో స్వీకరించే అవకాశం ఉంది. 


ఈ నేపథ్యంలో ‘‘హైకోర్టు తీర్పుతోనైనా ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగేనా?. ధర్మాసనం తీర్పుపై సుప్రీంకు వెళ్లిన జగన్ ఆలోచన సరైనదేనా?. మళ్లీ ఎన్నికలకు బ్రేక్ పడుతుందా?. అసలు వ్యాక్సినేషన్‌కు స్థానిక ఎన్నికలకు సంబంధం ఉందా?. జడ్జిలు మారాక కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయంటే అర్థం ఏంటి?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగరు.  

Updated Date - 2021-01-22T00:59:28+05:30 IST