విద్యుత్ కొనుగోలుపై ఏపీ హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-12-20T21:14:13+05:30 IST

సోలార్ పవర్ కార్పొరేషన్ నుంచి విద్యుత్ కొనుగోలుపై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.

విద్యుత్ కొనుగోలుపై ఏపీ హైకోర్టులో విచారణ

అమరావతి: సోలార్ పవర్ కార్పొరేషన్ నుంచి విద్యుత్ కొనుగోలుపై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. సోలార్ పవర్‌ను అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిటిషన్ వేశారు. యూనిట్ రూ. 2.05 ఉన్న సోలార్ పవర్‌ను రూ. 2.45కు కొనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించింది. సెకీ ద్వారా ఏపీకి విద్యుత్ సరఫరాకు అదానీ సంస్థ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఏపీలో యూనిట్ రూ. 2.05కే విద్యుత్ సరఫరా చేసేందుకు అనేక సంస్థలు సిద్ధంగా ఉన్నప్పటికీ.. వాటిని కాదని ఎక్కువ ధరతో కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందని ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఈ వాదనాలను పరిశీలించిన హైకోర్టు కేంద్ర ప్రభుత్వంతోపాటు అదానీ సంస్థ, సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఇంధన శాఖతో సహా మొత్తం పది మంది ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - 2021-12-20T21:14:13+05:30 IST