అమరావతి: పేదలందరికీ ఇళ్లు పథకంపై ఏపీ హైకోర్టు విచారణ
ABN , First Publish Date - 2021-11-30T18:15:30+05:30 IST
అమరావతి: పేదలందరికీ ఇళ్లు పథకంపై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
అమరావతి: పేదలందరికీ ఇళ్లు పథకంపై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. దీనిపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దీంతో ఇళ్ల స్థలాలపై పిటిషనర్లు వేసిన పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేయొద్దన్న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. గత నెల 8వ తేదీన పేదలందరికీ స్థలాలు పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.