మారుతి మహాలక్ష్మి పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2021-07-09T00:19:19+05:30 IST
మారుతి మహాలక్ష్మి పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ

అమరావతి: బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపిక నిలుపుదల చేయాలంటూ రెండో భార్య మారుతి మహాలక్ష్మి పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మఠానికి ఏ ప్రాతిపదికన స్పెషల్ కమిషనర్ను నియమించారో తెలపాలని దేవాదాయ శాఖను హైకోర్టు ఆదేశించింది. మఠాధిపతి ఎంపికపై దేవాదాయశాఖ అనవసర జోక్యం చేసుకుందని పిటిషనర్ మారుతి మహాలక్ష్మి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.