ఏపీ కరోనా తాజా అప్డేట్
ABN , First Publish Date - 2021-12-05T21:39:31+05:30 IST
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 154 కరోనా కేసులు నమోదు కాగా కరోనా వైరస్ తో నలుగురు మృతి చెందారు.
అమరావతి: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 154 కరోనా కేసులు నమోదు కాగా కరోనా వైరస్ తో నలుగురు మృతి చెందారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు 20,73,730 కరోనా కేసులు చేరగా, కరోనా4తో 14,452 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 2,122 యాక్టివ్ కేసులు ఉండగా, 20,57,156 మంది రికవరీ అయ్యారు. గుంటూరులో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.