జీతాలు లేటుగా ఇస్తే తప్పేంటన్న ప్రభుత్వాన్ని చూశామా?

ABN , First Publish Date - 2021-11-04T01:04:20+05:30 IST

‘ఒకవైపు ఒంటిపూట భోజనానికి ఇబ్బందిపడే కార్మికులు, చిరు వ్యాపారులు.. మరోవైపు జీతం రెండ్రోజులు ఆలస్యమైందంటున్న..

జీతాలు లేటుగా ఇస్తే తప్పేంటన్న ప్రభుత్వాన్ని చూశామా?

అమరావతి: ‘ఒకవైపు ఒంటిపూట భోజనానికి ఇబ్బందిపడే కార్మికులు, చిరు వ్యాపారులు.. మరోవైపు జీతం రెండ్రోజులు ఆలస్యమైందంటున్న ఉద్యోగులు.. ఎవరికి ప్రాధాన్యమివ్వాలి? రెండ్రోజులు ఆలస్యమైనా జీతాలు ఇస్తున్నాంగా! ఇబ్బందేంటి’ అని ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. చాలా మంది ఉద్యోగులు తనతో మాట్లాడారని, రెండు రోజులు జీతం ఆలస్యం అవడం వల్ల వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పారని,  కొవిడ్‌ సమయంలో ప్రపంచమంతా అప్పులు చేస్తోందని, రాష్ట్రం కూడా చేసిందన్నారు. అప్పులు తేవడం కూడా పాలనలో ఒక భాగమని, సంక్షేమం కోసమే అప్పులు చేశామని తెలిపారు. అప్పులు తేవడానికి బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో వ్యక్తిగతంగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరును చేర్చడంపై ప్రశ్నించగా.. ‘గవర్నర్‌ పేరుమీదే అన్నీ నడుస్తాయి. గత ప్రభుత్వంలోనైనా, ఇప్పుడైనా’ అని మంత్రి బదులిచ్చారు. గవర్నర్‌ వ్యవస్థ పేరు పెట్టొచ్చని, కానీ వ్యక్తిగతంగా ఎలా పేరు పెడతారు? దీనిపై గవర్నర్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు కదా అని అడుగగా.. ‘గవర్నర్‌ ఏమడిగారో నాకు స్పష్టంగా తెలీదు. అయినా అడగడం సాధారణం. దానికి వివరణ ఇస్తాం. పాలన అన్నాక ప్రశ్నలు అడగడం.. దానికి వివరణ ఇవ్వడం సాధారణం. ఏటా కాగ్‌ వందల ప్రశ్నలు అడుగుతుంటుంది. వాటికి సమాధానం ఇస్తుంటాం. ప్రశ్న అడగడమే తప్పంటే మరి గత ప్రభుత్వ హయాంలో కూడా కాగ్‌ వంద ప్రశ్నలు అడిగింది. తప్పు చేసినట్లేనా’ అని ప్రశ్నించారు.


ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ‘‘జీతాలు లేటుగా ఇస్తే తప్పేంటి అని అడిగే ప్రభుత్వాన్ని ఇంతకుముందు చూశామా?. బ్యాంక్ సూరిటీగా రాష్ట్ర గవర్నర్‌ను ఇరికించడం పరాకాష్టకాదా?. ప్రభుత్వ చేష్టలపై గవర్నర్ ఎందుకు లేట్‌గా స్పందిస్తున్నారు?. బ్యాంకులు అడ్డదారిలో లోన్లు ఇవ్వడం వెనుక బ్యాంక్ అధికారులు పాత్ర ఉందా?. తన పేరు వాడడంపై గవర్నర్ నిలదీస్తే ప్రభుత్వం టీడీపీని నిందించడం ఏంటి?.’’ అనే అంశాపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 


Updated Date - 2021-11-04T01:04:20+05:30 IST