ఏపీ బడ్జెట్ కేవలం అంకెల హంగామా: నాదెండ్ల మనోహర్
ABN , First Publish Date - 2021-05-20T23:57:05+05:30 IST
అభూత కల్పనలు, ఆత్మ స్తుతితో ఏపీ బడ్జెట్ ఉందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
అమరావతి: అభూత కల్పనలు, ఆత్మ స్తుతితో ఏపీ బడ్జెట్ ఉందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ బడ్జెట్ కేవలం అంకెల హంగామాగా ఉందని తప్పుబట్టారు. ప్రజలు తమ ప్రాణాలు కాపాడమని రోదిస్తుంటే.. సీఎం జగన్ను పొగిడేందుకు కొటేషన్లు, పద్యాలు చదివారని విమర్శించారు. థర్డ్ వేవ్ ముప్పు ఈ ఏడాదిలోనే ఉందని నిపుణులు చెప్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. శాసన మండలిలో మంత్రి ధర్మాన కృష్ణదాసు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2021-22 బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లు. తొలిసారిగా జెండర్ బడ్జెట్ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ వార్షిక బడ్జెట్లో రూ.47 వేల 283 కోట్లు జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. చిన్నపిల్లలకు చైల్డ్ బడ్జెట్లో రూ.16,748.47 కోట్లు ప్రత్యేకంగా కేటాయింపులు చేయడం జరిగింది.