ఏపీ బీజేపీ కోర్ కమిటీ ప్రకటన
ABN , First Publish Date - 2021-11-30T01:03:30+05:30 IST
రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ
అమరావతి: రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కోర్ కమిటీని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ ప్రకటించారు. ఈ కమిటీలో సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, సత్యకుమార్లు సభ్యులుగా ఉన్నారు. ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ , జీవీఎల్ నరసింహారావులను కూడా సభ్యులుగా నియమించింది. కోర్ కమిటీలో మధుకర్, మాధవ్, జయరాజు, చంద్రమౌళి, రేలంగి శ్రీదేవిలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా శివప్రకాష్ను నియమించింది.