మరో బిహార్‌లా రాష్ట్రం: రామ్మోహన్‌నాయుడు

ABN , First Publish Date - 2021-01-17T08:38:41+05:30 IST

వైసీపీ అరాచక పాలనతో రాష్ట్రం మరో బిహార్‌లా మారుతోందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

మరో బిహార్‌లా రాష్ట్రం: రామ్మోహన్‌నాయుడు

పాతపట్నం, జనవరి 16: వైసీపీ అరాచక పాలనతో రాష్ట్రం మరో బిహార్‌లా మారుతోందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. పాతపట్నం సబ్‌ జైల్‌లో ఉన్న టీడీపీ సోషల్‌ మీడియా సభ్యుడు లక్కోజు వినోద్‌ను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ శ్రేణులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని, మానవ హక్కుల కమిషన్‌కూ ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. ఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. 

Updated Date - 2021-01-17T08:38:41+05:30 IST