చికిత్స పొందుతూ ఏఎన్ఎం మృతి
ABN , First Publish Date - 2021-08-27T09:14:47+05:30 IST
కడప జిల్లా గాలివీడు మండలం పూలికుంట సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న విజయ కొవిడ్తో మృతి చెందారు.
![చికిత్స పొందుతూ ఏఎన్ఎం మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కడప: కడప జిల్లా గాలివీడు మండలం పూలికుంట సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న విజయ కొవిడ్తో మృతి చెందారు. వారం రోజులుగా ఆమెకు కొద్దిపాటి జ్వరం రావడంతో పరీక్షలు చేయించారు. పాజిటివ్గా తేలడంతో మెరుగైన చికిత్స కోసం నాలుగు రోజుల క్రితం కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం రాత్రి ప్రాణాలు విడిచారు. విజయ మరణ వార్త తెలియగానే నూలివీడు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రిజ్వాన్ భోరున విలపించారు. ఏఎన్ఎం కుటుంబానికి ప్రభుత్వపరంగా అందాల్సిన సాయంపై చర్యలు తీసుకుంటానని ఎంపీడీవో జాబీర్ అహ్మద్ తెలిపారు.