పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డ తహశీల్దార్‌

ABN , First Publish Date - 2021-12-22T16:16:50+05:30 IST

జిల్లాలోని కోరుకొండ మండలం రాఘవపురంలో పేకాటశిబిరంపై పోలీసుల దాడి చేశారు. పేకాట ఆడుతూ తహశీల్దార్‌ కిషోర్‌బాబు పోలీసులకు పట్టుబడ్డారు.

పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డ తహశీల్దార్‌

రాజమండ్రి: జిల్లాలోని కోరుకొండ మండలం రాఘవపురంలో పేకాటశిబిరంపై పోలీసుల దాడి చేశారు.  పేకాట ఆడుతూ తహశీల్దార్‌ కిషోర్‌బాబు పోలీసులకు పట్టుబడ్డారు. పేకాడుతూ పోలీసులకు కొత్తపేట తహశీల్దార్‌ కిషోర్‌బాబు చిక్కాడు. మొత్తం 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 సెల్‌ఫోన్లు, రూ.94 వేలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-12-22T16:16:50+05:30 IST