అనంతపురం జిల్లా: టీడీపీ మద్దతుదారులపై విధ్వంస కాండ
ABN , First Publish Date - 2021-06-23T18:20:34+05:30 IST
అనంతపురం జిల్లాలో వైసీపీ వర్గీయుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి.
అనంతపురం: జిల్లాలో వైసీపీ వర్గీయుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులపై విధ్వంస కాండ కొనసాగుతోంది. నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులే లక్ష్యంగా కక్ష్య సాధింపు ధోరణిలో వైసీపీ వర్గీయులు వ్యవహరిస్తున్నారు. కనగానపల్లి మండలం, మామిళ్లపల్లి గ్రామంలో గోవిందు అనే రైతుకు చెందిన పొలంలో వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేశారు.
అధికారపార్టీ వర్గీయులే తనను ఇబ్బంది పెట్టేందుకు వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేశారని బాధితుడు ఆరోపించాడు. గతంలో కూడా ఇలాగే చేశారని, వాటికి మరమ్మత్తులు చేయించుకుని వ్యవసాయం చేస్తుంటే.. ఇప్పుడు మరోసారి ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తక్షణమే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.