డ్రగ్స్‌ కేసులో ఏ 1 జగన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-10-07T08:53:38+05:30 IST

‘‘సీబీఐ, ఈడీ, మనీలాండరింగ్‌, ఐటీ కేసులతో ఆర్థిక ఉగ్రవాదైన జగన్‌రెడ్డి ఇప్పుడు తన నేర సామ్రాజ్యాన్ని డ్రగ్స్‌ దందా వరకు విస్తరించారు.

డ్రగ్స్‌ కేసులో ఏ 1 జగన్‌రెడ్డి

నా, ద్వారంపూడి పర్యటనలపై కేంద్ర సంస్థల దర్యాప్తునకు సిద్ధమా!

సజ్జలకు సవాల్‌ విసిరిన లోకేశ్‌

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ‘‘సీబీఐ, ఈడీ, మనీలాండరింగ్‌, ఐటీ కేసులతో ఆర్థిక ఉగ్రవాదైన జగన్‌రెడ్డి ఇప్పుడు తన నేర సామ్రాజ్యాన్ని డ్రగ్స్‌ దందా వరకు విస్తరించారు. రూ.72 వేల కోట్ల హెరాయిన్‌ దిగుమతిపై డీఆర్‌ఐ కేసులోనూ జగన్‌రెడ్డి ఏ 1’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన చేశారు. ‘‘ప్రజల ఆరోగ్యం కాపాడే పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి వ్యాపారం మాది. జనం ప్రాణాలు తీసి, లక్షల కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చే హెరాయిన్‌, గంజాయి, ప్రాణాంతక మద్యం మాఫియాలు మీవి’’ అని ధ్వజమెత్తారు. ‘‘మీ రెండున్నరేళ్ల పాలనలో నాపై కక్షకట్టి పెట్టిన ట్రాక్టర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసు తప్పించి.. మీరు ఆరోపించిన వాటిలో రూపాయి అయినా అవినీతి, అక్రమాలను నిరూపించగలిగారా? ఎస్‌... నేను దుబాయ్‌లో నా కుటుంబ సభ్యులతో ఉన్నా. నా పర్యటనపైనా, మీ డ్రగ్స్‌ బిగ్‌ బాస్‌ బినామీ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సీక్రెట్‌గా వెళ్లిన డ్రగ్స్‌ హెవెన్‌ ఐవరీ కోస్ట్‌ టూర్‌పైనా కేంద్ర సంస్థల దర్యాప్తునకు సిద్ధమా?.. బ్రోకర్‌ సజ్జలా!’’ అని సవాల్‌ చేశారు. ‘‘సజ్జల తీరు డ్రగ్స్‌ దొంగే.. దొంగా, దొంగా అని అరిచినట్లుంది. డ్రగ్స్‌ బిగ్‌ బాస్‌ ఎవరు? అంటే.. బ్రోకర్‌ సజ్జల ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు?’’ అని లోకేశ్‌ విమర్శించారు.

Updated Date - 2021-10-07T08:53:38+05:30 IST