విశాఖ, విజయనగరం జిల్లాలో ఏసీబీ ఆకస్మిక దాడులు

ABN , First Publish Date - 2021-07-20T22:04:19+05:30 IST

అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుండడంతో విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఏసీబీ

విశాఖ, విజయనగరం జిల్లాలో ఏసీబీ ఆకస్మిక దాడులు

విశాఖ/ విజయనగరం: అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుండడంతో విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఏసీబీ ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ రెండు జిల్లాల్లోని 12 తహసీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేసింది. విశాఖ జిల్లాలో 6, విజయనగరం జిల్లాలో 6 కార్యాలయాలపై ఏసీబీలోని 12 బృందాలు దాడులు చేశాయి. ఈ కార్యాలయాల్లో అధికారులపై పదేపదే అవినీతి ఆరోపణలు రావటంతో ఏసీబీ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ దాడులు రెవెన్యూ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. 

Updated Date - 2021-07-20T22:04:19+05:30 IST