9 మంది ఏఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతి
ABN , First Publish Date - 2021-12-07T02:36:15+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9 ఏఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9 ఏఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పి.బిజోయో, జగన్నాథరెడ్డి, జి.నాగన్న, యు.రవిప్రకాష్, ఎన్వీఎస్ మూర్తి, రఘువీరారెడ్డి, బి.రవిచంద్రలకు నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పించింది. ఏఎస్పీ ట్రాఫిక్గా ఉన్న కె.బాబూరావుకు డీసీపీ ట్రాఫిక్గా పదోన్నతి కల్పించింది. అదనపు ఎస్పీ విజిలెన్స్గా ఉన్న కెఎస్ఎస్వీ సుబ్బారెడ్డిని అదే స్థానంలో ఎస్పీ విజిలెన్స్గా పదోన్నతిని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
