ఇక ఏడు గంటలే కర్ఫ్యూ
ABN , First Publish Date - 2021-08-21T09:04:05+05:30 IST
కరోనా నేపథ్యంలో విధించిన కర్ఫ్యూ సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. అలాగే కర్ఫ్యూ నిబంధనల అమలును మరో రెండు వారాలు పొడిగించింది. శు
![ఇక ఏడు గంటలే కర్ఫ్యూ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సమయాన్ని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. సెప్టెంబరు 4 వరకూ కర్ఫ్యూ పొడిగింపు
అమరావతి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో విధించిన కర్ఫ్యూ సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. అలాగే కర్ఫ్యూ నిబంధనల అమలును మరో రెండు వారాలు పొడిగించింది. శుక్రవారం వరకు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు అంటే 8 గంటలపాటు కర్ఫ్యూ అమల్లో ఉంది. శనివారం నుంచి కర్ఫ్యూ సమయాన్ని రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు తగ్గించినట్టు పేర్కొంటూ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సెప్టెంబరు 4వ తేదీ వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సమీక్షించిన అనంతరం ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సింఘాల్ తెలిపారు