51 మంది తెలంగాణ ఉద్యోగులు రిలీవ్
ABN , First Publish Date - 2021-04-23T10:52:47+05:30 IST
తెలంగాణ స్థానికతతో సాధారణ పరిపాలన శాఖలో పనిచేస్తున్న 51 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీవ్
అమరావతి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్థానికతతో సాధారణ పరిపాలన శాఖలో పనిచేస్తున్న 51 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీవ్ చేసింది. క్లాస్ 3, 4 ఉద్యోగులుగా ఉన్న వారంతా వెంటనే రిలీవ్ అవుతారని, తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ సాధారణ పరిపాలనశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ వారిని తాము చేర్చుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.