పెన్షన్ల చెల్లింపునకు 30 కోట్లు విడుదల
ABN , First Publish Date - 2021-07-07T01:35:28+05:30 IST
రాజధాని అమరావతి ప్రాంతంలో భూమిలేని కుటుంబాలకు పెన్షన్ల చెల్లింపునకు 30 కోట్ల రూపాయల
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో భూమిలేని కుటుంబాలకు పెన్షన్ల చెల్లింపునకు 30 కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం పాలనానుమతి ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి 30 కోట్ల మొత్తాన్ని పెన్షన్లుగా చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈమేరకు లబ్దిదారుల ఖాతాల్లో పెన్షన్ జమచేయాల్సిందిగా అమరావతి మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ను పురపాలక శాఖ ఆదేశించింది.