రాష్ట్రంలో 20 లక్షలు దాటిన కేసులు
ABN , First Publish Date - 2021-08-21T09:02:55+05:30 IST
రాష్ట్రంలో కరోనా కేసులు 20 లక్షల మార్కుని దాటేశాయి. గత 24 గంటల్లో 69,173 శాంపిల్స్ను పరీక్షించగా 1,435 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
![రాష్ట్రంలో 20 లక్షలు దాటిన కేసులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కొత్తగా 1,435 కేసులు.. 6 మరణాలు
అమరావతి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు 20 లక్షల మార్కుని దాటేశాయి. గత 24 గంటల్లో 69,173 శాంపిల్స్ను పరీక్షించగా 1,435 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 20,00,038కి చేరుకుంది. కరోనాతో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 13,702కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపింది.