పశువైద్య ల్యాబ్‌లకు 14.40 కోట్లు మంజూరు

ABN , First Publish Date - 2021-05-21T10:09:06+05:30 IST

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్తగా పశువ్యాధుల నిర్ధారణ ప్రయోగశాలల (సీఏడీడీఎల్‌) నిర్మాణం, పాత ల్యాబ్‌ల పునరుద్ధరణ పనులకు రూ.14.40 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు

పశువైద్య ల్యాబ్‌లకు 14.40 కోట్లు మంజూరు

అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్తగా పశువ్యాధుల నిర్ధారణ ప్రయోగశాలల (సీఏడీడీఎల్‌) నిర్మాణం, పాత ల్యాబ్‌ల పునరుద్ధరణ పనులకు రూ.14.40 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అథారిటీ చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ పి.వెంకట్రామిరెడ్డి, సభ్యకార్యదర్శిగా అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి, ఆంధ్రావర్సిటీ పర్యావరణ శాస్త్ర ఆచార్యుడు బైరాగిరెడ్డిని నియమించారు. ఈ అథారిటీకి సహాయపడేలా ఆంధ్రావర్సిటీ సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు చైర్మన్‌గా రాష్ట్ర స్థాయి నిపుణుల మదింపు కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. 

Updated Date - 2021-05-21T10:09:06+05:30 IST