ఏపీలో కొత్తగా 130 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-12-30T23:40:11+05:30 IST
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 130 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 20,76,979 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 14,493 మరణాలు సంభవించాయి. ఏపీలో 1,081 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,61,405 మంది రికవరీ చెందారు.