మ్యాంగో ఛీజ్ కేక్
ABN , First Publish Date - 2020-05-23T18:37:33+05:30 IST
బిస్కెట్లు - 125 గ్రాములు, వెన్న - 60 గ్రాములు, పనీర్ - 50 గ్రాములు, మామిడిపండు గుజ్జు - రెండు కప్పులు, పంచదార - ఒకకప్పు, జున్ను - రెండు కప్పులు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ - ఒక స్పూన్.
కావలసినవి: బిస్కెట్లు - 125 గ్రాములు, వెన్న - 60 గ్రాములు, పనీర్ - 50 గ్రాములు, మామిడిపండు గుజ్జు - రెండు కప్పులు, పంచదార - ఒకకప్పు, జున్ను - రెండు కప్పులు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ - ఒక స్పూన్.
తయారీ: బిస్కెట్లను పొడిగా చేసుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి. వెన్నను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి, బిస్కెట్ల పొడిలో వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా మందపాటి, వెడల్పాటి పాత్రలో సమంగా వేసి కొద్దిగా ఒత్తాలి. (కేక్ తయారుచేసే పాత్ర తీసుకోవాలి) తరువాత ఫ్రిజ్లో పెట్టాలి. మిక్సీలో పనీర్, జున్ను వేసి మెత్తటి పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసి కలుపుకోవాలి. తరువాత అందులో మామిడిపండు గుజ్జు వేసి కలియబెట్టుకోవాలి. ఈ మామిడిపండు మిశ్రమాన్ని బిస్కెట్ పొడి మిశ్రమంపై పోసి మళ్లీ ఫ్రిజ్లో పెట్టాలి. ఇప్పుడు మరొకపాత్రలో కొద్దిగా మామిడిపండు గుజ్జు, పంచదార, నీళ్లు తీసుకుని స్టవ్పై మరిగించాలి. ఈ మిశ్రమాన్ని పైన ఒక లేయర్గా పోయాలి. అంతే... ఎంతో రుచికరమైన మ్యాంగో ఛీజ్ కేక్ రెడీ.