29 నుంచి యాదాద్రిలో పవిత్రోత్సవాలు
ABN , First Publish Date - 2020-07-19T07:22:19+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శ్రావణ శుద్ధ దశమి రోజైన ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన....

యాదాద్రి టౌన్, జూలై 18: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శ్రావణ శుద్ధ దశమి రోజైన ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈవో గీతారెడ్డి తెలిపారు. మూడో రోజు జూలై 31న పవిత్రీకరించిన పవిత్ర (108 నూలుపోగు దారాలతో తయారు చేసిన మాల)ల ను స్వామి అమ్మవార్లకు అలంకరిస్తారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ పూజోత్సవాలను ఆస్థానపరంగా నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. కాగా, ఈ నెల 30, 31వ తేదీల్లో భక్తులు ఆన్లైన్ ద్వారా నిర్వహించుకునే సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణ వేడుకలను నిలిపివేయనున్నారు. అదేవిధంగా పాతగుట్ట ఆలయంలోనూ ఈ నెల 29 నుంచి పవిత్రోత్సవాలు జరుగుతాయని చెప్పారు.