ఉత్తమ్‌ వ్యాజ్యంలో అవాస్తవాలు!

ABN , First Publish Date - 2020-06-23T10:07:57+05:30 IST

తమ పార్టీ నేతలను గృహ నిర్బంధం, అరెస్టు చేసి ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను హరిస్తోందంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలోని అంశా లు సత్యదూరంగా ఉన్నాయని అదనపు డీజీపీ రాజీవ్‌రతన్‌ హైకోర్టుకు

ఉత్తమ్‌ వ్యాజ్యంలో అవాస్తవాలు!

హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): తమ పార్టీ నేతలను గృహ నిర్బంధం, అరెస్టు చేసి ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను హరిస్తోందంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలోని అంశా లు సత్యదూరంగా ఉన్నాయని అదనపు డీజీపీ రాజీవ్‌రతన్‌ హైకోర్టుకు తెలిపారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వం తరఫున ఆయన కౌంటర్‌ దాఖలు చేశారు. వ్యక్తిగత కార్యకలాపాలకు ఎక్కడా అడ్డుచెప్పడం లేదన్నారు. కానీ, రాజకీయ కారణాలతో దీక్షలకు పిలుపునిచ్చారని, దీనివల్ల కేంద్ర హోంశాఖ జారీచేసిన కొవిడ్‌-19 నిబంధనల ఉల్లంఘనలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.  పిటిషనర్‌ ప్రస్తావించిన అంశాలన్నీ అవాస్తవమని, ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.

Updated Date - 2020-06-23T10:07:57+05:30 IST