ప్లాట్‌ఫాంపై మహిళ ప్రసవం

ABN , First Publish Date - 2020-03-19T11:06:55+05:30 IST

ప్రసవం కోసం వెళ్తున్న ఓ నిండు చూలాలుకు ప్లాట్‌ఫాం వేదికగా కాన్పు చేసి న ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల

ప్లాట్‌ఫాంపై మహిళ ప్రసవం

గార్ల, మార్చి 18: ప్రసవం కోసం వెళ్తున్న ఓ నిండు చూలాలుకు ప్లాట్‌ఫాం వేదికగా కాన్పు చేసి న ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల రైల్వే స్టేషన్‌లో బుధవారం చోటు చేసుకుంది.  మహబూబాబాద్‌కు చెందిన రాతోలు శైలజ తన పుట్టినిల్లు ఏపీలోని విజయవాడ-కొండపల్లి నుంచి గోల్కొండ ఎక్స్‌ప్రె్‌సలో మహబూబాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగింది.


 శైలజ తన తల్లి పద్మతో మహబూబాబాద్‌ ఆసుపత్రిలో ప్రసవం కోసం వస్తుండగా  డోర్నకల్‌ వద్ద పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. అదే రైల్లో డ్యూటి కోసం వెళ్తున్న గార్ల ఆయూర్వేద వైద్యురాలు డాక్టర్‌ జ్యోతి  స్థానిక వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ గార్ల రైల్వే స్టేషన్‌కు చేరుకునే సరికి వైద్య సిబ్బంది ప్రసవానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు.


 శైలజను స్టేషన్‌లో దింపి అక్కడే బెంచిపై చీరలతో తెరచాటు  కట్టారు. డాక్టర్‌  జ్యోతి అక్కడకు చేరుకున్న  వైద్యుడు పవన్‌తో కలిసి  శైలజకు కాన్పు చేశారు. ప్లాట్‌ఫాం వేదికగా చీరల తెరచాటు నడుమ శైలజ మగబిడ్డకు జన్మనిచ్చింది.  రైల్వే స్టేషన్‌లో గంట పాటు శ్రమించి వైద్యులు కాన్పు చేశారు. అనంతరం తల్లి బిడ్డను క్షేమంగా  స్వగ్రా మం మహబూబాబాద్‌కు తరలించారు. సకాలం లో స్పందించి కాన్పు చేసిన వైద్య సిబ్బందిని స్థానికులు అభినందించారు.

Updated Date - 2020-03-19T11:06:55+05:30 IST